ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం.
ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్.
మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలు.
ఓటు హక్కు వినియోగించుకోనున్న 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు.
అందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.
28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతర ఓటర్లు.
మొదటి విడతలో 37వేల 562 పోలింగ్ కేంద్రాలు.
అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు.
ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్.
మొదటి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం.