క్రీస్తు బోధనలు అందరూ అనుసరించదగినవి.
-అరెంద సర్పంచ్ జాడి రామస్వామి.
జనం వాయిస్,మంథని,డిసెంబర్ 14 :
యేసుక్రీస్తు బోధనలు అందరూ అనుసరించదగినవని మంథని మండలం అరెంద సర్పంచ్ జాడి రామస్వామి అన్నారు. ఆదివారం సీయోను ప్రార్ధన మందిరం ఆధ్వర్యంలో మంథని మండలం ఆరెంద గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు క్రీస్తు జన్మ పవిత్రమైనదని ఆయన పేర్కొన్నారు. అనంతరం మంథని మండలం మల్లారం, శాస్త్రూలపల్లి గ్రామాల్లో క్రిస్మస్ క్యారల్స్ నిర్వహించారు. క్రీస్తు జన్మదినం ప్రాముఖ్యతను గురించి తెలియపరుస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు దూడ మహేశ్, అజ్మీరా దయారాజ్, మంథని మార్క్, సంఘ పెద్దలు అంకరి కుమార్ ఎంకే జోసఫ్ మంథని ప్రసాద్, అందే రమేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.