రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు జనం వాయిస్, వెబ్ డెస్క్: రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్ఐలు ఏసీబీకి పట్టుబడ్డారు. హైదరాబాద్ ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఓ నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు ఎస్‌ఐలు బాబునాయక్, ప్రమోద్ ఫిర్యాదుదారుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో లంచం తీసుకుంటున్న ఎస్ఐలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.