janamvoice.com
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 12:59 pm Digital Edition : JANAM VOICE

ఆస్ట్రేలియా జట్టును ఓడించి..ఫైనల్ చేరిన భారత్ మహిళా జట్టు.!

ఆస్ట్రేలియా జట్టును ఓడించి..ఫైనల్ చేరిన భారత్ మహిళా జట్టు.!

జనం వాయిస్ దినపత్రిక, డెస్క్:

భారత్ మహిళల ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్‌లో ఏ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంతేకాకుండా ఏడు సార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. 2022లో జరిగిన మహిళల ప్రపంచ కప్‌ను కూడా ఆస్ట్రేలియానే గెలుచుకుంది. భారత్ సాధించిన ఈ విజయంపై అందరు ప్రముఖ క్రికెటర్లు టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ స్పందన కూడా బయట పడింది. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఓడించి నందుకు టీమిండియాకు విరాట్ అభినందనలు తెలిపారు. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జెమీమా రోడ్రిగ్జ్ బ్యాటింగ్‌ను కూడా ఆయన ఎంతగానో ప్రశంసించారు.విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా రాశారు.. “ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై మనకు లభించిన అద్భుతమైన విజయం. అమ్మాయిలు చాలా అద్భుతంగా ఛేజ్ చేశారు. ఈ పెద్ద మ్యాచ్‌లో జెమీమా అసాధారణమైన బ్యాటింగ్‌ చేసింది. ఇది పట్టుదల, విశ్వాసం, అభిరుచికి నిజమైన ప్రదర్శన. శభాష్, టీమ్ ఇండియా.”మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా భారత్ ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఇంతకు ముందు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఎప్పుడూ ఛేజ్ చేయలేదు.కానీ జెమీమా రోడ్రిగ్జ్ , కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధాటిగా బ్యాటింగ్ చేయడం, మొత్తం జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఈ లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే సాధించారు. ఆస్ట్రేలియా ను ఓడించి టీమ్ ఇండియా మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది.