కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిదిమంది మృతి.
జనం వాయిస్, వెబ్:
శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.కాశిబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా పలువురు గాయపడినట్లు సమాచారం.
కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ఏకాదశి కావడంతో వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. రెయిలింగ్ ఊడటంతో భక్తులు కింద పడ్డారు.