janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 11:27 am Digital Edition : JANAM VOICE

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

జనం వాయిస్, హైదరాబాద్‌:

శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పునరుద్ధరించిన మండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌,  సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు తదితరులు పాల్గొన్నారు.