janamvoice.com
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 3:55 pm Digital Edition : GATTU MAHESH

దేవాలయానికి విరాళం అందజేసిన NRI

దేవాలయానికి విరాళం ప్రకటించిన NRI.

జనం వాయిస్, ముత్తారం :

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దొడ్డ సమ్మయ్య శ్రీదేవి దంపతులు (ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ సోదరుడు).అడవి శ్రీరాంపూర్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయం మరియు అయ్యప్ప స్వామి దేవాలయానికి 1,50,000. ఒక లక్ష యాభై వేల రూపాయలు విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ  ఉండాలని కోరుకుంటూ మరియు ఇంత విరాళం ఇచ్చినందుకు వారి కుటుంబానికి గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.వారి వెంట దొడ్డ బాలాజీ,ఆలయ కమిటీ సభ్యులు,పలువురు,తదితరులు ఉన్నారు.