కొత్తగూడెంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.
– మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు.
– సిపిఎం మద్దతుతో 28కి చేరిన కాంగ్రెస్ బలం.
– మేయర్ పదవిని చెరి రెండున్నర సంవత్సరాల చొప్పున పంచుకునే ఒప్పందం.
జనం వాయిస్, కొత్తగూడెం, ఫిబ్రవరి 15:
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో కార్పొరేషన్లో అధికార సమీకరణాలు కీలక మలుపు తిరిగాయి.
సిపిఎం మద్దతుతో కలిపి కాంగ్రెస్ బలం 28కి చేరినట్లు సమాచారం. ఈ మార్పుతో కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం బలపడినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశమైంది. మేయర్ పదవిని చెరి రెండున్నర సంవత్సరాల చొప్పున పంచుకునేలా సిపిఐ–కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ అవగాహనతో కార్పొరేషన్ పరిపాలనలో స్థిరత్వం తీసుకురావాలనే ఉద్దేశం ఉన్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో జరిగిన ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అధికార మార్పిడి, మేయర్ ఎన్నికల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశముంది.