ఆ ఊర్లో కట్నం తీసుకోరు.. మద్యం తాగొద్దు..!
జనం వాయిస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ (D) ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ పటేల్ మేస్రం వేంకట్ అధ్యక్షతన గ్రామస్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో సంచలన తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పూర్తిగా వరకట్నాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఊర్లో జరిగే వివాహానికి ప్రతి ఇంటి నుంచి రూ.200 ఇవ్వాలన్నారు. అలాగే పెళ్లికి వచ్చేటప్పుడు మద్యం తాగవద్దని, ఇతర గ్రామాలకు వెళ్లేటప్పుడు చెప్పులు వేసుకోవద్దన్నారు. కట్నంగా బైకులనూ నిషేధించారు.