తిరుమలలో భక్తుల రద్దీ.-27 కంపార్ట్మెంట్లలో వేచి, సర్వదర్శనానికి 12 గంటల సమయం.
జనం వాయిస్, తిరుపతి:
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేకుండా సర్వదర్శనం కోరుతున్న భక్తులకు ప్రస్తుతం సుమారు 12 గంటల వేచి ఉండాల్సి వస్తోంది. ఈ ఉదయం వరకు మొత్తం 27 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.నిన్న రోజున మాత్రమే 66,389 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యదర్శనం పొందగా, భక్తి భావంతో 24,956 మంది తమ తలనీలాలు సమర్పించారు.భక్తుల అంకితభావం హుండీ ఆదాయంలో కూడా కనిపించింది. నిన్నటి రోజు మాత్రమే హుండీ ద్వారా రూ. 3.81 కోట్లు వచ్చాయి.వారాంతం, సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో మరో కొన్ని రోజులు ఇదే రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఆలయ వర్గాలు సూచిస్తున్నాయి.