నిర్మాణంలో ఉన్న గోదాం కుప్పకూలి విషాదం..

నిర్మాణంలో ఉన్న గోదాం కుప్పకూలి విషాదం.. - శిథిలాల కింద డజన్ల మంది కార్మికులు.జనం వాయిస్, కోల్‌కతా, జూన్ 24: పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక గోదాం కుప్పకూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న డజన్ల మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటన కోల్‌కతాలోని తరతలా ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, సుమారు 50 మంది కార్మికులు గోదాం నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో అకస్మాత్తుగా నిర్మాణం కూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న...