ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు తృటిలో తప్పిన ప్రమాదం
డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనా సమయంలో ప్రమాదం.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు తృటిలో తప్పిన ప్రమాదం.ఫ్లోరింగ్ కుంగిపోవడంతో అధికారులు ఆందోళన.అప్రమత్తంగా స్పందించిన స్థానిక నాయకులు. జనం వాయిస్, వేములవాడ : ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్కు మంగళవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనుల పురోగతిని పరిశీలించేందుకు అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆది శ్రీనివాస్ అక్కడికి...