అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చట్టరీత్యా చర్యలు తెలుసుకుంటాం.
– ఎస్సై చంద్రకుమార్.
– అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత.
జనం వాయిస్, సుల్తానాబాద్:
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నటువంటి రెండు టిప్పర్లను స్థానిక ఎస్సై చంద్రకుమార్ పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లకు ఎలాంటి అనుమతులు లేవని,ఎవరైనా అక్రమంగా మట్టి గాని,ఇసుక గాని తరలించినట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.