23 ఏళ్లకే సర్పంచ్.
జనం వాయిస్, భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ యువ అభ్యర్థి సంగి అంజలి (23) విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 41 ఓట్ల తేడాతో గెలుపొందారు.అంజలి విజయం గ్రామ యువతలో నూతన ఉత్సాహాన్ని నింపింది. తక్కువ వయస్సులోనే ప్రజల విశ్వాసాన్ని ఆమె సంపాదించారు.