కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.!
జనం వాయిస్ దినపత్రిక, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది,రోడ్డు దాటుతున్న సమయంలో రెండు బైకులు ఢీకొని వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాద తీవ్రతతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమ య్యాయి.రెండు బైకులు కూడా అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా, మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు బైక్ ల వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వెంటనే స్థానికులు వారిని అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వీడియో ఇప్పు డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో ఈ వీడియో మరోసారి గుర్తు చేసింది.ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments