మంథనిలో అనారోగ్యంతో బాధపడుతూ మహిళా ఆత్మహత్య.
జనం వాయిస్, మంథని:
అనారోగ్యంతో బాధపడుతూ మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మంథనిలో చోటుచేసుకుంది.మంథని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంథని పట్టణానికి చెందిన సిరిపురం వీరలక్ష్మి గత పది సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతుంది.కరీంనగర్, హైదరాబాదులోని పలు హాస్పటల్లో చూపించిన ఆరోగ్యం బాగు పడకపోవడంతో జీవితం పై విరక్తి చెంది మంగళవారం ఉదయం ఇంట్లో తలుపులు దర్వాజలకు వేసిన పెయింట్ ను కడుగుటకు తెచ్చి పెట్టిన పెట్రోల్ ను ఒంటిపై పోసుకొని నిప్పు అట్టించుకోని మృతి చెందింది.మృతురాలి కొడుకు సిరిపురం వీర శంకర్ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మంథని పోలీసులు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments