EPAPER
Tuesday, February 17, 2026
Google search engine

పురుడు పోసిన 108 సిబ్బంది.

📰 Generate e-Paper Clip

పురుడు పోసిన 108 సిబ్బంది.

జనం వాయిస్, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గోవిందుల మౌనిక (28) మహిళకు పురిటి నొప్పులు ప్రారంభం రావడంతో కుటుంబ సభ్యులు 108 కి సమాచారం అందించారు.హుటాహుటిన అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకోగానే మహిళకు పురిటి నొప్పులు తీవ్రతరం కావడంతో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్ చాకచక్యంగా వ్యవహరించి వారి గృహంలోని డెలివరీ నిర్వహించడం జరిగినది.మా మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ప్రాథమిక చికిత్స అనంతరం తల్లి,బిడ్డలను తదుపరి చికిత్స నిమిత్తం పెద్దపల్లి లోని మాత శిశు ఆసుపత్రికి తరలించడం జరిగింది.ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు.సకాలంలో స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, పైలట్ మామిడి సంపత్ లకు మాతా శిశు ఆరోగ్య సిబ్బంది అభినందనలు తెలియజేశారు.మరియు  కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!