EPAPER
Friday, April 3, 2026
Google search engine

నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం-మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.

📰 Generate e-Paper Clip

నూతన ఆవిష్కరణ లకు ప్రభుత్వ ప్రోత్సాహం.రాష్ట్ర ఐటి,పరిశ్రమలు,శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు.
-గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు చర్యలు.
-ఆసక్తి గల విద్యార్థులకు హైదరాబాదులోని టీ వర్క్స్ సందర్శనకు ఏర్పాట్లు.
-మంథని టీ వర్క్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక సంబంధించిన పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.
-మంథని జూనియర్ కళాశాలలో 44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.

జనం వాయిస్,మంథని,నవంబర్-12:


నూతన ఆవిష్కరణ లకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఐ.టి,పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.బుధవారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  తో కలిసి మంథని డ్రీమ్ స్టార్ట్ కార్యాలయంలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు  ఆధునిక సాంకేతిక సంబంధించిన మైండ్ సెట్ మేకర్ పుస్తకాన్ని ఆవిష్కరించి,ఇంగ్లీష్ టు తెలుగు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించిన విధంగా పిల్లలు మంచి కలలు కని, వాటిని సాధించేందుకు కార్యాచరణ ప్రారంభించాలని మంత్రి సూచించారు.

పిల్లల ఆలోచనలను పదును పెట్టేందుకు డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ కృషి చేస్తుందని అన్నారు.మంథని లోని యువకులు నూతనంగా తయారు చేసిన వ్యవసాయ పవర్ ఫిడర్, ఆధునిక హెల్మెట్ తయారి వంటి ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మంథని లో టీ వర్క్స్ ఆధ్వర్యంలో డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ ఏర్పాటు చేయడం  జరిగిందని అన్నారు.గ్రామీణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యం వెలికి తీయడానికి ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 20 పాఠశాలల్లో డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు.డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటున్న విద్యార్థులకు హైదరాబాద్ లోనే టీ వర్క్ సందర్శనకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు.అనంతరం మంథని పట్టణంలోని పోచమ్మ వాడలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.రైతులకు తూకంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని, 48 గంటలో బ్యాంకు ఖాతాలలో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు.అంతకంటే ముందు మంథని జూనియర్ కళాశాలల ఆవరణలో 44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టీ వర్క్స్ సీఈఓ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ గౌడ్,ఆర్.డి.ఓ.సురేష్,తహసిల్దార్,ఎంపిడిఓ, సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!