లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డ తహశీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్.
-వారసత్వ భూసంబంధిత రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్.
-ప్రైవేట్ డ్రైవర్ ద్వారా డబ్బు స్వీకరిస్తూ ఎర్రకల్లులో పట్టుబాటు.
-లంచం కోరితే వెంటనే 1064 కు ఫిర్యాదు చేయాలని ఎసీబీ విజ్ఞప్తి.
జనం వాయిస్,మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల తహశీల్దారు & జాయింట్ సబ్రిజిస్ట్రార్ వీరగంటి మహేందర్ లంచం కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కాడు.ఫిర్యాదుదారురాలి భర్తకు అతని మామగారి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను తనకు అనుకూలంగా జరిపించేందుకు రూ. 15,000 లంచం డిమాండ్ చేసినట్టు ఎసీబీ వెల్లడించింది డిమాండ్ చేసిన లంచం మొత్తాన్ని తన ప్రైవేట్ డ్రైవర్ తుప్పాని గౌతమ్ ద్వారా స్వీకరిస్తున్న సమయంలో ఎసీబీ అధికారులు రంగంలోకి దిగడంతో ఇద్దరూ రంగేహస్తులయ్యారు లంచం విషయంలో తెరవెనుక జరుగుతున్న వ్యవహారాన్ని ముందుగా ఫిర్యాదుదారు ఎసీబీకి తెలియజేయగా, అధికారులు ముందస్తు పథకం ప్రకారం ఈ ఆపరేషన్ను అమలు చేశారు.ఈ ఘటన సందర్భంగా ఎసీబీ అధికార వర్గాలు, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశాయి అదనంగా వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు అధికారిక వెబ్సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపారు “ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి” అని ఎసీబీ స్పష్టం చేసింది.అవినీతి నిర్మూలనలో ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు రావాలంటూ అవినీతి నివారణ శాఖ పిలుపునిచ్చింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments