తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించిన భట్టి విక్రమార్క.
కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు.
నూతన దంపతులకు ఆశీస్సులు కోరిన భట్టి.
రాష్ట్ర బడ్జెట్కు ముందు దేవుడి ఆశీర్వాదాలు కోరిన మంత్రి.
జనం వాయిస్, తిరుమల, మార్చి 09:
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నూతన దంపతులు సూర్య విక్రమాదిత్య, సాక్షి దీర్ఘాయుష్షుతో సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను త్వరలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమగ్ర వృద్ధిని సాధిస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయిలో పోటీ పడే రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో దేవుడి ఆశీర్వాదాలు కోరినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments