సింగర్ మంగ్లీపై కేసు నమోదు.
జనం వాయిస్, హైదరాబాద్:
సింగర్ మంగ్లీ పై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదయింది. న్యాయవాది సుబ్బారావు తనను ఆక్సిడెంట్ చేసి చంపిస్తానని మంగ్లీ మనుషులు బెదిరించినట్లుగా పిర్యాదు చేసారు. తన దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మోసం చేసిందని, అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించిందని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాదాపు 150 మందిని మోసం చేశారని, డ్రెరెక్టర్ వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు కూడా ఈ కుట్రలో భాగమని ఆరోపించాడు. తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు ఫిర్యాదు చేయడంతో, బీఎన్ఎస్ S 351(2), 352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ, వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేసారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments