కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.
రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై చర్చ.
జనం వాయిస్, న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, ఆర్థిక సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర మంత్రులతో జరిగిన ఈ సమావేశాలు రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టుల పురోగతికి, కేంద్ర–రాష్ట్ర సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments