కరీంనగర్ కారులో చెలరేగిన మంటలు.
జనం వాయిస్, కరీంనగర్:
హైదరాబాద్- కరీంనగర్ ప్రధాన రహదారిపై అలుగునూరు వంతెన వద్ద మారుతి 800 కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు సకాలంలో బయటకు దూకడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ సంఘటనతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments