- ‘నేను కాంగ్రెస్ సర్పంచ్ని.. వదిలేయండి’ అంటూ ఆవేదన.
- – అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.
- – తప్పుగా గుర్తించి అరెస్ట్ చేశారంటూ ఆరోపణ.
- – సర్పంచ్ కాత మల్లేశం వివరణ.
- జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 24:
- అసెంబ్లీ సమీపంలో చోటుచేసుకున్న ఘటనలో రేపాక గ్రామ సర్పంచ్ కాత మల్లేశం అరెస్ట్ కావడం కలకలం రేపింది. ‘నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని.. నన్నెందుకు అరెస్ట్ చేశారు.. దండం పెడతా వదిలేయండి’ అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి అక్కడున్న వారిని కదిలించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం ఎమ్మెల్యే కవ్వంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన పాసులతో మల్లేశం అసెంబ్లీ ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ భద్రతా చర్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత కారణంగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.ఈ సందర్భంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడని భావించి తనను అరెస్ట్ చేశారని మల్లేశం ఆరోపించారు. తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరిగిన చర్య అన్యాయమని పేర్కొన్నారు. పోలీసులు భద్రతా కారణాలతో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ను తప్పుగా అరెస్ట్ చేసినట్లయితే వెంటనే విడుదల చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments