మంత్రి శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపిన సూరయ్యపల్లి రైతులు.
జనం వాయిస్, మంథని:
మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామ రైతులు తమ పొలాలకు రాళ్ళకుంట నుండి వెళ్లే దారి ఇబ్బందిగా మారిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి అరేల్లి కిరణ్ గౌడ్ తెలియజేయగా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెంటనే స్పందించారు.సంబంధిత అధికారులతో మాట్లాడిన మంత్రి రైతుల సమస్యను పరిష్కరించేందుకు మట్టి రప్పించేలా చర్యలు చేపట్టారు.గ్రామ రైతులు సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారం చూపినందుకు మంత్రి శ్రీధర్ బాబు కు సూరయ్యపల్లి గ్రామ రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments