స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్కు పకడ్బందీగా చర్యలు.
– ముత్తారం ఎస్ఐ ఎన్.రవికుమార్.
జనం వాయిస్, ముత్తారం, పెద్దపల్లి:
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు ముత్తారం ఎస్ఐ ఎన్.రవికుమార్ తెలిపారు.రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని అడవీ శ్రీరాంపూర్, ఓడేడు,ముత్తారం,కేశన్ పల్లి గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ రవి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని,పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.ప్రజలు పోలీసులకు సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments