పెద్దపల్లి జిల్లాకు సెమీ కండక్టర్ యూనిట్ ఇవ్వాలి.
– కేంద్ర మంత్రిని కోరిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.
జనం వాయిస్, పెద్దపల్లి :
పెద్దపల్లి జిల్లాకు సెమీ కండక్టర్ యూనిట్ ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయిన ఆయన ఎంపీ… సెమీ కండక్టర్ పరిశ్రమ ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సరిపడా వనరులు, స్కిల్డ్ యూత్ జిల్లాలో ఉన్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. గతంలోనే పెద్దపల్లికి సెమీ కండక్టర్ పరిశ్రమ రావాల్సి ఉన్నా… చంద్రబాబును సంతోష పెట్టేందుకే AP కి తరలించారని ఆరోపించారు MP వంశీకృష్ణ.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments