EPAPER
Monday, February 16, 2026
Google search engine

మీడియాపై పోలీస్ జులుం – ఇదేనా ‘ప్రజా ప్రభుత్వం’?

📰 Generate e-Paper Clip

తెల్లవారుజామున జర్నలిస్టుల అరెస్టులు.

మీడియాపై పోలీస్ జులుం – ఇదేనా ‘ప్రజా ప్రభుత్వం’?

జనం వాయిస్, హైదరాబాద్ :


ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్‌టీవీకి చెందిన జర్నలిస్టుల అరెస్టుల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నిరసనల నడుమ అర్ధరాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి బెయిల్ మంజూరు చేయడం—ఈ కేసు ఎంత అత్యుత్సాహంగా ముందుకు నడిపించబడిందన్నదానికి నిదర్శనంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పండుగ సెలవుల నిమిత్తం కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో మరో ఇద్దరు జర్నలిస్టులు చారి, సుధీర్ల ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నోటీసులు జారీ చేయకుండానే తెల్లవారుజామున అరెస్టులు జరగడం తీవ్ర అభ్యంతరాలకు దారి తీసింది.
“జర్నలిస్టులు ఆర్థిక నేరస్తులా? ఉగ్రవాదులా?” అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పోలీసుల చర్యలు ప్రభుత్వ, పోలీస్ వ్యవస్థల దిగజారుడుతనాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శకులు అంటున్నారు.

ఒక కేసు ఆధారంగా జర్నలిస్టుల కుటుంబాలపై కూడా వేధింపుల పర్వం కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద కథనానికి సంబంధించిన స్క్రిప్ట్ రైటర్, న్యూస్ ప్రెజెంటర్ (యాంకర్) కుటుంబాల ఇళ్లకు వెళ్లి పోలీసులు ప్రశ్నలు వేసినట్లు, వేధింపులకు పాల్పడ్డట్లు—సిట్ అధికారి ఒప్పుకున్నట్టు వచ్చిన సమాచారం సంచలనం రేపుతోంది. యాజమాన్యాన్ని పక్కన పెట్టి, కేసుతో ప్రత్యక్ష సంబంధం లేని కుటుంబాలను భయాందోళనకు గురిచేశారని జర్నలిస్టు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఎన్‌టీవీ కార్యాలయంలో సోదాలు నిర్వహించడం, న్యూస్‌రూమ్‌లను భయపెట్టే చర్యగా అభివర్ణిస్తున్నారు.

సిట్ పాత్రపై సందేహాలు.

ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినప్పటికీ, అసలు నివేదిక వెలువడకముందే అరెస్టులు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సిట్‌కు నాయకత్వం వహిస్తున్న సీనియర్ అధికారి సజ్జనార్ పాత్రపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“నిజాలు నిగ్గు తేలకముందే చర్యలు చట్టపాలనకు విరుద్ధం” అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం చెప్పిందే అమలు చేస్తున్నట్టు అనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రజాస్వామ్యంపై పోలీస్ దాడేనా?

జర్నలిస్టు సంఘాలు ఈ అరెస్టులను మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్నాయి. కథనం తప్పయితే ఖండించడానికి, వివరణ కోరడానికి, న్యాయస్థానాలను ఆశ్రయించడానికి చట్టబద్ధ మార్గాలు ఉన్నప్పటికీ—అవన్నీ పక్కన పెట్టి అరెస్టులు, సోదాలు, వేధింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అభిప్రాయపడుతున్నాయి.

‘ప్రజా ప్రభుత్వం’గా చెప్పుకునే కాంగ్రెస్ పాలనలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

జర్నలిస్టు సంఘాల డిమాండ్లు

జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి.

అక్రమ అరెస్టులు, సోదాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

సిట్ దర్యాప్తును నిష్పక్షపాతంగా పూర్తి చేసి నిజాలను ప్రజలకు వెల్లడించాలి.


మరోసారి జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యం, అక్రమ కేసులు పెడితే క్షమించేది లేదని మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఇసంపెల్లి వేణు, అఖిల భారత జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చుంచు కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ పరకాల సమ్మయ్య గౌడ్ హెచ్చరించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!