కూలిన ప్రైవేట్ శిక్షణ విమానం..కెప్టెన్, ట్రైనీ పైలట్కు గాయాలు.
– ఇంజిన్లో సాంకేతిక లోపంతో ప్రమాదం.
– పొలంలో కూలిన విమానం.
– దర్యాప్తు చేపట్టిన ఏవియేషన్ అధికారులు.
జనం వాయిస్, బెంగళూరు, ఫిబ్రవరి 8:
కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ప్రైవేట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అది కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని కెప్టెన్, ట్రైనీ పైలట్ గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రెడ్ బర్డ్ ఏవియేషన్కు చెందిన ప్రైవేట్ శిక్షణ విమానం కలబురగి నుంచి బెళగావికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఇంజిన్లో అకస్మాత్తుగా సమస్య ఏర్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఇంజిన్లో లోపం తలెత్తిన వెంటనే పైలట్లు విమానాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ, విజయపుర జిల్లా మంగళూరు గ్రామ పరిధిలోని పొలంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో కెప్టెన్, ట్రైనీ పైలట్కు గాయాలు కాగా, స్థానికులు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్లో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన బాబలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమాన భద్రత, సాంకేతిక లోపాలపై సమగ్రంగా విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments