పెళ్లైన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య.
జనం వాయిస్, హైదరాబాద్ :
పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మూసాపేటలో చోటుచేసుకుంది. చందన జ్యోతి, యశ్వంత్కు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన చందన జ్యోతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments