రూ.55కే 1000 కి పైగా లైవ్ టీవీ ఛానళ్లు.. జియో కొత్త యాడ్-ఆన్ ప్లాన్..
జనం వాయిస్, జూలై 10, బిజినెస్ న్యూస్:
టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ జియో తన వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.55తో 30 రోజుల పాటు 1000కిపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తూ కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉండనుంది.
ఈ ప్లాన్లో సాధారణ టీవీ ఛానళ్లతో పాటు 150కిపైగా ప్రీమియం ఛానళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. జియోస్టార్, సోనీ, సన్ టీవీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ నెట్వర్క్లకు చెందిన ప్రముఖ వినోద, వార్తలు, క్రీడలు, సినిమాలు, పిల్లల కార్యక్రమాల ఛానళ్లు ఇందులో భాగంగా లభించనున్నాయి.
ఈ సేవను పొందాలంటే ముందుగా రూ.55 యాడ్-ఆన్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవాలి. అనంతరం జియోటీవీ యాప్లో తమ జియో నంబర్తో లాగిన్ అయితే అదనపు రుసుము లేకుండానే 1000కిపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.
ఓటీటీ, కేబుల్ టీవీ సేవల ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ధరలో విస్తృత వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో జియో ఈ ప్రత్యేక ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా మొబైల్లోనే ప్రత్యక్ష టెలివిజన్ కార్యక్రమాలను వీక్షించాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ మంచి ఎంపికగా నిలవనుంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments