తల్లి కూతుర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు.
ఇబ్రహీంపట్నం, మే 30,(జనం వాయిస్ ):
హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆద్వర్యంలో 2ఫిబ్రవరి 2026న 777 మంది తో కార్యక్రమం నిర్వహించారు. అందులో ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మెట్లిల్ల గ్రామానికి చెందిన అంగన్వాడి టిచర్ గా పని చేస్తున్న గుంటి అరుణ మరియ ఎస్వి స్ టీటీఆర్ స్కూల్ లో చదువుతున్న అభిజ్ఞ రోజ్ (10) గుంటి శ్రీ విజ్ఞ(8) శుక్రవారం గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ కార్యక్ర మంలో వివిద దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు గంటపాటు కి బోర్డ్ వాయించారు. వారికి వ్యవస్థాపకుడు అగస్టిన్ దండింగి గర్టిఫికెట్లు అందజేశారు.
ఈ విజయంతో వారు తమ కుటుంబానికి, పాఠశాలకు మరియు ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అందరూ ఆకాంక్షించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments