EPAPER
Friday, July 10, 2026
Google search engine

శ్రేయస్‌కు సోదరి అండ..

📰 Generate e-Paper Clip

శ్రేయస్‌కు సోదరి అండ..

జనం వాయిస్, జూలై 10, స్పోర్ట్స్ న్యూస్:

  టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొంటున్న వేళ అతడి సోదరి శ్రేష్ఠ అయ్యర్ అండగా నిలిచింది. ఐర్లాండ్ పర్యటనతో తొలిసారి భారత జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్‌పై వస్తున్న విమర్శలకు ఆమె ఘాటుగా స్పందించింది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా తమ కెరీర్‌లో ఎన్నో ఓటములు చవిచూశారని గుర్తు చేస్తూ, ప్రతి పరాజయానికీ శ్రేయస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరైన విధానం కాదని పేర్కొంది.
ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన శ్రేష్ఠ అయ్యర్.. సచిన్, కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు కూడా తమ ప్రయాణంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారని, అయినప్పటికీ వారు తిరిగి నిలబడి విజయాలు సాధించారని చెప్పింది. అలాంటప్పుడు శ్రేయస్‌ను మాత్రమే పదేపదే విమర్శించడం సరికాదని, అలా చేస్తే సమస్య అతడిలో కాకుండా విమర్శించే వారి ఆలోచనలోనే ఉండొచ్చని వ్యాఖ్యానించింది.
శ్రేయస్‌ను దిగ్గజాలతో పోల్చవద్దంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో స్పందించినప్పటికీ, తన సోదరుడిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని శ్రేష్ఠ స్పష్టం చేసింది. శ్రేయస్‌లో అపారమైన ప్రతిభ ఉందని, సరైన సమయం వచ్చినప్పుడు భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలుస్తాడని తాను బలంగా నమ్ముతున్నానని తెలిపింది.
మరోవైపు వరుస వైఫల్యాలు ఎదురైనా శ్రేయస్ అయ్యర్‌పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు జట్టు యాజమాన్యం పూర్తి విశ్వాసం ఉంచినట్లు సమాచారం. 2028 టీ20 ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకుని యువ జట్టును తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా శ్రేయస్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని యాజమాన్యం భావిస్తున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!