షాబాద్ నిందితుడిపై 2 లక్షల రివార్డ్
జనం వాయిస్, రంగారెడ్డి, జులై 12:
రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు దారుణ హత్యకు గురైన సంఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్ కుమార్ పై రెండు లక్షల రివార్డ్ ప్రకటించారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఈ మొత్తాన్ని అందజేస్తా మన్నారు ఈ ఘటన లో షాబాద్ ఎస్సై రమేష్ ను సస్పెండ్ చేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన అందరి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితుల కుటుంబానికి ప్రభుత్వం తరఫు న అండగా ఉంటామన్నారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుడి కోసం 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments