EPAPER
Tuesday, March 3, 2026
Google search engine

సంక్రాంతి వేళ మందుబాబులకు షాక్.. మద్యం ధరలు పెంపు.

📰 Generate e-Paper Clip

సంక్రాంతి వేళ మందుబాబులకు షాక్.. మద్యం ధరలు పెంపు.

– అన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10 పెంపు.
– రిటైలర్ల మార్జిన్‌లో ఒక శాతం పెంపు.
– కొన్ని బ్రాండ్లు, బీరు, వైన్‌లకు మినహాయింపు.

జనం వాయిస్, అమరావతి:


సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10 పెంపు చేయడంతో పాటు, రిటైలర్ల మార్జిన్‌ను ఒక శాతం పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ధరల పెంపు ఐఎంఎఫ్ఎల్, విదేశీ మద్యం విభాగాలకు వర్తిస్తుందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. అయితే రూ.99 ధరలో లభించే కొన్ని బ్రాండ్లు, బీరు, వైన్, రెడీ టు డ్రింక్స్‌పై ఈ పెంపు వర్తించదని పేర్కొంది. దీంతో తక్కువ ధర మద్యం వినియోగదారులకు కొంత ఊరట లభించినట్లయింది.
మరోవైపు బార్లపై విధిస్తున్న రిటైల్ ఎక్సైజ్ పన్నును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయంతో బార్ నిర్వహణదారులకు కొంతమేర ఉపశమనం కలగనున్నప్పటికీ, సాధారణ వినియోగదారులపై ధరల భారం పడనుందని అంచనా వేస్తున్నారు.
పండుగ సీజన్‌లో మద్యం ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పెంచే చర్యగా అధికారులు దీన్ని సమర్థిస్తుండగా, మరోవైపు పండుగ వేళ ఇలా ధరలు పెంచడం ప్రజలపై భారం మోపినట్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!