మరిపెడ మండలం సోమ్లా తండాలో కార్డన్ సెర్చ్.
నాటుసారా తయారీ కేంద్రాలపై మెరుపు దాడి.
నాటుసారా కాస్తున్న ఆరుగురు అదుపులోకి.
మరిపెడ,ఆగస్టు 22(జనం వాయిస్):
మహబూబాబాద్ జిల్లా పోలీసు అధికారి శబరిష్ ఆదేశాల మేరకు మరిపెడ సిఐ ఎల్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో మరిపెడ మండలం సోమ్లా తండాలో కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. అనుమానితుల ఇళ్లు,గుడుంబా స్థావరాలే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో బెల్లం,పంచదారతో నాటుసారా కాస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.సుమారు 1500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.20 లీటర్ల తయారుచేసిన నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.నాటుసారా తరలింపునకు ఉపయోగిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సి ఐ ఎల్ పవన్ కుమార్ మాట్లాడుతూ,గ్రామస్తులకు సమాజంలో జరుగుతున్న అంతర్జాల మోసాలు,రహదారి భద్రత,మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు,ఇంట్లో పిల్లల ప్రవర్తనపై అవగాహన కల్పించారు.చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్,చిన్నగూడూరు ఎస్సై కుశ కుమార్,సీరోలు ఎస్సై సంతోష్ తో పాటు సుమారు 20 మంది సిబ్బంది పాల్గొన్నారు…
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments