EPAPER
Sunday, April 19, 2026
Google search engine

ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు..

📰 Generate e-Paper Clip

ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు..

జనం వాయిస్ , ఏప్రిల్ 19, వెబ్ డెస్క్:

ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి సామాన్యులను షాక్‌కు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా గూడూరు మార్కెట్‌లో నిమ్మ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం 50 కేజీల నిమ్మ బస్తా ధర ఏకంగా రూ.10,000 వరకు పలుకుతోంది.
కిలో ధర రూ.200 దాటింది
గత వారం వరకు కిలో నిమ్మకాయలు రూ.130 నుంచి రూ.150 మధ్య ఉండగా, ఇప్పుడు రూ.200 మార్కును దాటాయి. వేసవి ఎండలు పెరగడంతో ప్రజలు నిమ్మరసం వంటి పానీయాల వినియోగం పెంచడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
దిగుబడి తగ్గుదలే ప్రధాన కారణం
వ్యాపారుల సమాచారం ప్రకారం, ఈ ఏడాది నిమ్మ దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల మార్కెట్‌కు సరఫరా తగ్గింది. ఒకవైపు డిమాండ్ పెరగడం, మరోవైపు సరఫరా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి.
ఈ పరిస్థితిలో నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!