కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు పోలీసుల నోటీసులు.
ఈ నెల 7న అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన.
రిజర్వ్ ఇన్స్పెక్టర్ జంగయ్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.
ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ పోలీసుల నోటీసులు.
జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 14:
తెలంగాణ శాసనసభ వేదికగా ఇటీవల జరిగిన ఆందోళనల వ్యవహారం ఇప్పుడు న్యాయపరమైన మలుపులు తిరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్లకు సైఫాబాద్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. సెప్టెంబర్ 7న అసెంబ్లీ గేట్ నెంబర్ 3 వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేపట్టిన నిరసన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై, సీఏఆర్ హెడ్క్వార్టర్స్ ఆర్ఐ బి.జంగయ్య ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 9న బీఎన్ఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ దర్యాప్తులో భాగంగానే, కేసు విచారణాధికారి అయిన ఎస్సై సత్యనారాయణ సమక్షంలో ఈరోజు విచారణకు హాజరు కావాలని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు, తమపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ వీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను విచారించిన ఉన్నత న్యాయస్థానం… అరెస్టు వంటి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే, కేసు దర్యాప్తును చట్టప్రకారం కొనసాగించవచ్చని కోర్టు ఇచ్చిన వెసులుబాటు ఆధారంగానే సైఫాబాద్ పోలీసులు ఈ విచారణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments