EPAPER
Tuesday, March 3, 2026
Google search engine

దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి మంత్రివర్గ ఆమోదం.

📰 Generate e-Paper Clip

దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి మంత్రివర్గ ఆమోదం.

– ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిదవ విమానాశ్రయం.
– వాణిజ్యం–పర్యాటకానికి కొత్త ద్వారం.
– ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది.

జనం వాయిస్, అమరావతి:


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కీలక ఆమోదం తెలిపింది. నౌకాశ్రయాలు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లకు సమీపంగా ఈ విమానాశ్రయాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో ఇది ఎనిమిదవ విమానాశ్రయంగా నిలవనుంది.
దగదర్తిలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని సుమారు 1,332 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో సంవత్సరానికి సుమారు 14 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో నిర్మాణం చేపట్టనున్నారు. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్యతో పాటు సరుకు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సంవత్సరానికి 1.5 కోట్లకు పైగా ప్రయాణికులు మరియు కార్గో కార్యకలాపాలను నిర్వహించేలా విస్తరణకు అవకాశం కల్పించనున్నారు.
ఈ విమానాశ్రయం వాణిజ్యం, పరిశ్రమలు, పర్యాటకం రంగాలకు కీలక ద్వారంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఎగుమతులు–దిగుమతులు, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు ఇది పెద్ద ఊతమివ్వనుంది. అలాగే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభంతో రాష్ట్రంలో రవాణా అనుసంధానం మరింత బలోపేతమవుతుందని, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాధాన్యం మరింత పెరుగుతుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఇది రాష్ట్ర అభివృద్ధి దిశలో మరో కీలక అడుగుగా ప్రభుత్వం పేర్కొంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!