EPAPER
Thursday, April 2, 2026
Google search engine

కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం.ప్రముఖ నేత సహా 15 మంది మృతి.

📰 Generate e-Paper Clip

కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం. ప్రముఖ నేత సహా 15 మంది మృతి.

– మృతుల్లో ప్రముఖ మానవ హక్కుల నేత డియోజెనెస్ క్వింటెరో.

–  టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ కంట్రోల్‌తో సంబంధాలు కట్.

– ప్రమాదంలో ఎవరూ బతకలేదని అధికారికంగా ప్రకటన.

జనం వాయిస్, అంతర్జాతీయం:

కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దేశ ఈశాన్య ప్రాంతంలోని నార్టే డి సెంటాండర్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ సటెనాకు చెందిన ఒక చిన్న విమానం బుధవారం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు సిబ్బంది, 13 మంది ప్రయాణికులతో సహా మొత్తం 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రముఖ రాజకీయ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త డియోజెనెస్ క్వింటెరో కూడా ఉండటంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

HK4709 రిజిస్ట్రేషన్ నంబర్ గల ఈ విమానం, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:42 గంటలకు కుకుటా విమానాశ్రయం నుంచి ఒకాన్యాకు బయలుదేరింది. 40 నిమిషాల ఈ ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు కురాసికా అనే మారుమూల గ్రామీణ ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు గుర్తించారు. వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

విమానం ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన తర్వాత అందులో ఎవరూ ప్రాణాలతో మిగిలిలేరని అధికారులు ధ్రువీకరించినట్లు కొలంబియా రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ మరణాలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!