EPAPER
Friday, June 26, 2026
Google search engine

నిర్మాణంలో ఉన్న గోదాం కుప్పకూలి విషాదం..

📰 Generate e-Paper Clip

నిర్మాణంలో ఉన్న గోదాం కుప్పకూలి విషాదం..

– శిథిలాల కింద డజన్ల మంది కార్మికులు.

జనం వాయిస్, కోల్‌కతా, జూన్ 24:

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక గోదాం కుప్పకూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న డజన్ల మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటన కోల్‌కతాలోని తరతలా ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, సుమారు 50 మంది కార్మికులు గోదాం నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో అకస్మాత్తుగా నిర్మాణం కూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న కార్మికులు పెద్ద సంఖ్యలో శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు సహాయక చర్యలు ప్రారంభించి శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులు, విపత్తు స్పందన బృందాలు, రక్షణ దళాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటివరకు ఏడుగురు కార్మికులను సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని బయటకు తీసేందుకు గ్యాస్ కట్టర్ల సహాయంతో భారీ బీమ్‌లను కట్ చేస్తూ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!